రెడ్లకు కేసీఆర్‌ వరాలు

4
– 10 ఎకరాల స్థలం.. రూ.10 కోట్లు

– ట్యాంక్‌బండ్‌పై సురవరం, రావినారాయణ రెడ్డి తదితరులు విగ్రహాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌18(జనంసాక్షి):

పాతబస్తీలోని అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైందని కొనియాడారు. 75 ఏళ్లుగా రెడ్డి జనసంఘం సమాజసేవ చేస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌పై రాజాబహదూర్‌ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెడ్డి హాస్టల్‌ విస్తరణ కోసం హైదరాబాద్‌ పరిసరాల్లో 10 ఎకరాల స్థలం కేటాయిస్తాం.. రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హావిూనిచ్చారు. ఈ వేడుకల్లో ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, లోకాయుక్త జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ జూబ్లీ స్థూపాన్ని సీఎం ఆవిష్కరించారు.