రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

– వ్యవసాయ విస్తరణ అధికారి బాబు
కుల్కచర్ల, జులై 26(జనం సాక్షి): రైతులు కొత్తగా జూన్ 22 వరకు పాస్ పుస్తకం వచ్చిన రైతులు రైతు భీమా కొరకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కుల్కచర్ల క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శివాని బాబు సూచించారు.మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ..కొత్త పాస్ బుక్ వచ్చిన రైతులు భీమ ఎన్రోల్మెంట్ ఫార్ము నింపి, రైతు పట్టా పాస్ బుక్, రైతు ఆధార్ కార్డు,నామిని ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీలు జత చేసి మాకు ఇవ్వాలని తెలిపారు.దూర ప్రాంతాలలో ఉన్న రైతులు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఇచ్చిన వాటిని మాత్రమే స్వీకరిస్తామని అన్నారు.గతంలో అప్లై చేసుకున్నవారు నామిని మార్చుకోవాలన్న లేదా పేర్లు తప్పుగా ఉన్న సవరించుకోవాలన్నారు.ఇప్పుడు దరఖాస్తు చేసుకోకపోతే వచ్చే 2023 సంవత్సరం జూలై, ఆగస్టు వరకు అవకాశం ఉండదని తెలిపారు.కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
Attachments area

తాజావార్తలు