రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ జూలై 5 (జనంసాక్షి) గద్వాలజిల్లాకేంద్రంలోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండల పరిధిలోని నీలిపల్లి గ్రామానికి చెందిన కురువ తిరుపతి అనారోగ్యంతో  మరణించారు.మంగళవారం కుటుంబ సభ్యులకు భార్య కురువ సత్యమ్మ కు ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం    గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతులమీదుగా  రైతు బీమా ద్వారా 5 లక్షలు రూపాయలుచెక్కును అందజేశారు.ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని  ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ విష్ణు,తెరాస పార్టీ నాయకులు అజయ్,నరసింహారెడ్డి,జయరాం, ఎలిసన్ ,మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.