రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్  మండలం పరిధిలోని  అమరవాయి గ్రామానికి చెందిన నడిపి నల్లన్న  మరణించారు.వారి కుటుంబ సభ్యులకు భార్య ఎల్లమ్మ కు  ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా రైతు బీమా ద్వారా 5 లక్షలు రూపాయలు చెక్కును మంగళవారం అందజేశారు.ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని  ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గోపాల్ రెడ్డి,తెరాస పార్టీ నాయకులు తూంకృష్ణారెడ్డి, మహేష్,తిమ్మప్ప, ఆంజనేయులు,నడిపి మద్దిలేటి,నల్లన్న తదితరులు పాల్గొన్నారు.