రైల్వేస్టేషన్‌ను తనిఖీచేసిన జీఎం

కర్నూలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ జీఎన్‌.అస్థాన్‌ ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. సిగ్నల్‌, రన్నింగ్‌ గదులను పరిశీలించిన ఆయన రైలుపట్టాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డుప్రమాదాల కంటే రైలు ప్రమాదాలు తక్కువే జరుగుతున్నాయని ఆయన అన్నారు. గుంటూరు-నంద్యాల లైను త్వరలో విద్యుత్‌లైను చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.