రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తులు మృతి

ఖమ్మం:  ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు అతని భార్య మరణించారు. సజీవరావు అతని భార్య ద్విచక్రవాహనంపై వెళ్తుంగా ఎదురుగా వచ్చిన వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు.