రోడ్లు అధ్వానం… ప్రయాణం భయానకం

చౌడాపూర్, ఆగస్టు 08( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని హీర్లవాగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని గుబ్బడి తండా నుంచి జాకారం వరకు గల బీటీ రోడ్డు మొత్తం గుంతలతో మరియు కంకర తేలిపోవడంతో రోడ్డుపై ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించడం లేదన్నారు. గర్భిణీలకు గాను, ఎవరికైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ రోడ్డుపై వెళ్లాలంటే మధ్యలోనే ఏమవుతుందో అని భయంగా ఉందని గ్రామ ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేయాలని దాడి సేవ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బానావత్ పాండు నాయక్ అధికారులను కోరడం జరిగింది.