లడ్డూపాటలో రెడ్డినగర్ దే హవా

– మండలంలో భారీ విగ్రహం ఘనత

మునగాల, సెప్టెంబర్ 10(జనంసాక్షి): నవరాత్రులు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించి లడ్డుపాట వేలంలో మండలంలో ఘనత దక్కించుకున్న రెడ్డినగర్ గణేష్ ఉత్సవ కమిటీదేనని రెడ్డినగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం జనంసాక్షికి ప్రత్యేకంగా తెలిపారు. మండలంలోని దాదాపు 15 అడుగుల ఎత్తు గల భారీ విగ్రహాన్ని నెలకొల్పడం రెడ్డినగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఘనతేనని, మండల కేంద్రానికి చెందిన ఉప్పుల కళింగరెడ్డి ఒక లక్ష ఐదువేల నూట పదహారు రూపాయలకు లడ్డువేలం పాట పలికారని రెడ్డినగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో కోలాటాలు, నృత్యం, దీపాల కాంతుల నడుమ భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిజనసంఘం పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.