లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: వారం ఆరంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 28,182 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 66.81 వద్ద కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ ఎక్సే్చంజ్లో హిందాల్కో, భారత్ పెట్రోలియం, అదానీ పోర్ట్స్, టాటాపవర్, బోష్ లిమిటెడ్ షేర్లు లాభపడగా.. భారతీఎయిర్టెల్, ఐడియా, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.