లారీ- కారు ఢీ: ముగ్గురు మృతి

రంగారెడ్డి, జనంసాక్షి:  బంటారం మండలం బొక్నారం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుమ చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. లారీ-కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.