లేపాక్షి సందర్శించిన హైకోర్టు సీజే
హైదరాబాద్:రాష్ట్రంలో హస్తకళల అభివృద్దికి లేపాక్షి తరహ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని హైకోర్టు తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ అన్నారు.హైదరాబాద్ గన్ఫౌండ్రీలో ఉన్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించారు.అక్కడి కళాఖండాలను పరిశీలించారు.వాటి పనితనాన్ని ప్రశంసించారు.