వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన జడ్పి కో ఆప్షన్ మెంబర్

తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్ ను శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జడ్పీ కోఆప్షన్ నెంబర్ తాహెర్ బిన్ సలాం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా   కలిశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ తాలూకాలో పరిధిలోని వక్ఫ్ బోర్డు పరిధిలోని భూములను సర్వే చేయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దాంతోపాటే వివిధ సమస్యలపై వినతిపత్రం అందించాలన్నారు. దీనిపై బోర్డ్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు నారాయణ రెడ్డి ఉన్నారు.