వచ్చే వారంలో హోదాకు పరిష్కారం: సుజనా

ఢిల్లీ: వచ్చే వారం ప్రత్యేకహోదాకు పరిష్కారం రావచ్చని భావిస్తున్నామని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని వెల్లడించారు. ప్రత్యేకహోదాపై ప్రధాని, ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించారని, ఏపీ సమస్య తన బాధ్యతని ప్రధాని అన్నారని సుజనాచౌదరి తెలిపారు. రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా చెప్పడం బాధాకరమని అన్నారు. బిల్లు పాస్ అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, వైసీపీకి చిత్తశుద్ధి లేకనే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయని సుజనాచౌదరి విమర్శించారు.636060146305867152