వజ్రోత్సవాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.

తాండూరు అగస్టు 8(జనంసాక్షి)75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ హెచ్ ఐసిసి  లో నిర్వహించిన కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ లు తాండూర్ చైర్మన్ విఠల్ నాయక్, కోటపల్లి చైర్మన్ ఉప్పరి మహేందర్, బషీరాబాద్ చైర్మన్ రాజరత్నం, పరిగి చైర్మన్ సురేందర్, కుల్కచర్ల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా
నిలిచిందన్నారు. అదేవిధంగా రైతుల కోసం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ కోసం షాదిముబారక్ ,కళ్యాణ లక్ష్మీ, పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.వజ్రోత్సవవేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ లతో పాల్గోనడం జరిగిందన్నారు.