*వజ్రోత్సవాలు ముగిసినా ఇండ్లపై ఎగురుతున్న జెండాలు*

దోమ ఆగష్టు 27 (జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో వజ్రో  త్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై ఎగురవేసిన త్రివర్ణ పథాకాలు నేటికీ ఇండ్ల పైనే రెప రెప లాడుతున్నాయని పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులు ఈ.ప్రతాప్ గౌడ్ ఒక ప్రకటనలో అన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇరవై రెండవ తేదీ నాడు జాతీయ జెండాను దించాలి.కానీ మండలంలో నేటికీ అక్కడక్కడ ఇండ్లపైనే జెండాలు కనపడు తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి  జాతీయ జెండాకు అవమానం జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరినారు.