వరదలో కొట్టుకుపోయిన యువతిని రక్షించిన స్థానికులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై29(జనంసాక్షి ): కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని రక్షించడటంతో ప్రమాదం తప్పింది. శ్రావణ శుక్రవారం తొలిరోజు కాళేశ్వరం పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. చెన్నైకి చెందిన జై ప్రియా కాలుజారి గోదావరిలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.