వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

రాత్రంతా ప్రయాణికులు అందులోనే!

  • నెక్కొండ: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దీంతో సుమారు 40 మంది ప్రయాణికులు రాత్రంగా అందులోనే ఉండిపోయారు. వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో వీరు చిక్కుకుపోయారు. దీంతో ఎటూ ప్రయాణికులు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తమను రక్షించాలని బంధువుల, అధికారులకు వారు సమాచారం ఇచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్‌ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత వారి గమ్యస్థానాలకు తరలిస్తామని కలెక్టర్‌ తెలిపారు.