వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

జనంసాక్షి మంథని : ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి మంథనిలో సోమవారం జరిగిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. మంథని, ముత్తారం మండలాల్లోని మంథని గుంజపడుగు విలోచవరం పోతారం ఉప్పట్ల ఖానాపూర్ కాన్సాయిపేట ఆరేంద మల్లారం నాగ పెళ్లి అడవి సోమనపల్లి గోపాల్పూర్ చిన్న హోదాల ఓడేడు శ్రీరాంపూర్ ఖమ్మం పెళ్లి గ్రామాల్లోని సుమారు 1500 ఎకరాల పంట భూముల్లో ఇసుకమేటలు పెట్టడం పోతకు గురవడం తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరదలవల్ల నష్టపోయిన రైతుల, పంటల వివరాలు సేకరించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటలు నీట మునిగిన గ్రామాలకు వెళ్లి సర్వే చేసి రైతులకు పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు