వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

శుక్రవారం మండలంలో పానుగల్, గోప్లాపూర్,దవాజిపల్లి, మందాపూర్,చింతకుంట, మల్లాయిపల్లిలో కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో,సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,జడ్పిటిసి లక్ష్మీశేఖర్ నాయక్, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యాని కొనుగోలు చేస్తుందని, రైతులు నేరుగా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి,మద్దతు ధరను పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, సీఈఓ భాస్కర్ గౌడ్,ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.