వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి..

జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి..
 గద్వాల రూరల్ నవంబర్ 25 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేశాల మేరకు వరి ధ్యాన కొనుగోలు కేంద్రాన్ని మండల జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి…సర్పంచ్ పద్మమ్మ,ఎంపిపి నజ్మూనిస బేగం.. వైస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి…తో కలిసి ప్రారంభించారు..ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పిటిసి పద్మ పిలుపునిచ్చారు..గత ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా రైతు పండించిన పంటలకు మద్దతు ధర అందేది కాదు…రైతులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని,మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేను రైతు బిడ్డని అని గౌరవంగా చెప్పుకునే రీతిలో అభివృద్ధి చేసిన ఘనత తెచ్చిన మన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికే దక్కుతుందన్నారు…ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డి.ఆర్.విజయ్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటీసి దౌలన్న,ఏఈఓ మాధురి, అధికారులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..