వర్షంలోనూ కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ దీక్ష
హైదరాబాద్ : విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహాదీక్ష చేస్తున్న ఆదర్శ్నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భారీ వర్షం ప్రారంభమయింది. గాలి దుమారంతో దీక్షా ప్రాంగణంలో వేసిన టెంట్లు కూలిపోయాయి. భారీవర్షంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్ష కొనసాగిస్తున్నారు.



