వర్షాలకు నీటమునిగిన ఆర్టీఎ ఆఫీసు

జనగామ,జూలై23(జనంసాక్షి): జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్టీఎ ఆఫీస్‌ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్‌ కట్టారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వస్తుందంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అటు జనగామ కలెక్టరేట్‌ లోని సెల్లార్‌ లో వాటర్‌ లీకేజ్‌ అవుతోంది. మొన్నటి వానలకు బిల్డింగ్‌లోని విద్యా, పంచాయతీ, లేబర్‌ ఆఫీసులో వాటర్‌ లీకేజ్‌ అవుతుండటంతో మరమ్మత్తులు చేపట్టారు. అయితే శుక్రవరాం కురిసిన వర్షానికి కలెక్టరేట్‌ లోని సెల్లార్‌ లోని గోడల నుంచి వర్షపు నీరు వస్తోంది. అయితే నాసిరకం పనులతో గోడల నుంచి నీరు లీకవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనగగామలో భారీ వర్షాలు ముంచెత్తాయి.