వలసలకు తగ్గట్టు నగరాల అభివృద్ధి ఉండాలి

3

– ప్రధాని మోదీ

కుర్రుభాత్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లోని ధాంతరి జిల్లా కుర్రుభాత్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వృద్ధ మహిళ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 104 సంవత్సరాల ఈ మహిళ తన మేకలు అమ్మి తన ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకున్నారు. భారత్‌ మారుతుందనడానికి ఇదే నిదర్శనమని మోదీ చెప్పారు. కోటాభర్రి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు కున్వర్‌ భాయి. తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఈమె తన 10 మేకలు అమ్ముకున్నారు. గ్రామంలో ఇతరులను కూడా మరుగుదొడ్లు నిర్మించుకునేలా ఈమె ప్రోత్సహించారని మోదీ కీర్తించారు. ప్రస్తుతం ఈ గ్రామంలో అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. స్వచ్ఛభారత్‌ మిషన్‌ విజయవంతమయ్యేందుకు కున్వార్‌ బాయి స్ఫూర్తిగా నిలుస్తారని మోదీ కొనియాడారు.