వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన సర్పంచ్ భూక్య శ్రీనివాస్ నాయక్…

కేసముద్రం సెప్టెంబర్ 25 జనం సాక్షి/ కేసముద్రం మండలం తౌర్య తండ గ్రామ పంచాయతీలో ఆదివారం రోజున బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ను స్థానిక సర్పంచ్ భూక్య శ్రీనివాస్ నాయక్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ…ఈ వాటర్ ప్లాంట్ ని బాలవికాస స్వచ్ఛంద సంస్థ,గ్రామ ప్రజలు,దాతల సహకారంతో నిర్మించుకున్నామని,గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ సమస్య నుండి విముక్తి పొందారని అన్నారు.సహకారం అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊకంటి యాకూబ్ రెడ్డి, ఎంపీటీసీ చందు,బాల వికాస స్వచ్ఛంద సంస్థ బాల్ మోహన్ రెడ్డి,కిషన్ ,భూక్య నెహ్రూ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాము నాయక్,జాటోత్ యాకు, భూక్య శ్రీధర్, రేడ్య, రాంచంద్రు, వీరన్న, మోహన్, దేవా,వార్డు సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.