విజయవంతమైన కంటి వైద్య శిబిరం

జనం సాక్షి,వంగూర్:
జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ , లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం ఉదయం వంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య సహాయకులు బావండ్ల వెంకటేష్ 43 మందికి పరీక్ష చేసి 21 మందికి  శుక్లములు గుర్తించి ఆపరేషన్ నిమిత్తం రామ్ రెడ్డి కంటి ఆసుపత్రి ఎనుగొండకు తరలించి కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సుధాకర్ లాల్, సూపర్వైజర్లు ప్రమోద్ కుమార్, ,పద్మ, రాణమ్మ, రోజమ్మ, సిబ్బంది  శశి కుమార్, రాజశేఖర్, మేషక్, శివ ఇతర సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.