విజేత డిగ్రీ, పి జీ.కళాశాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

మిర్యాలగూడ. జనం సాక్షి
స్థానిక విజేత డిగ్రీ. పి జీ కళాశాల మరియు టాస్క్ ఆధ్వర్యంలో ఈ నెల 19 న ఆరు ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాల కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు విజేత కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ ఒక ప్రకటన లో తెలిపారు.19 వ తేదీ ఉదయం 9-30 నుండి ప్రారంభమయ్యే జాబ్ మేళా కు అర్హత గా 10 తరగతి నుండి ఇంటర్. డిగ్రీ. ఇంజనీరింగ్,బి బి ఎ, ఎం ఎస్ సీ,బి ఫార్మసీ, ఎం ఫార్మసీ,ఎం బి ఎ,ఐ టీ ఐ,డిప్లొమా చేసిన విద్యార్థినీ, విద్యార్థులు అర్హత గా 2018-2022 మధ్య ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే అని వివరించారు.ఇంటర్వ్యూ లలో రాత, ఆన్ లైన్, మౌఖిక,హెచ్ ఆర్ విభాగాలు ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.