విదేశాలకు ప్రధాని మోదీ

2

న్యూఢిల్లీ ఏప్రిల్‌ 9 (జనంసాక్షి):

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం విదేశీ పర్యటనకు బయలు దేరి వెళ్లారు.  నేటి నుంచి 16 వ తేదీ వరకు ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ద్వైపాక్షిక సంబంధాలు బలపరచుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం వంటి అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. తొలుత  ఫ్రాన్స్‌లో, 12 నుంచి జర్మనీలో, 14 నుంచి కెనడాల్లో మోదీ పర్యటన సాగుతుంది. ఇందులో భాగంగా జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లండ్‌తో, కెనడా ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌లతో మోదీ సమావేశమవుతారు.