విద్యా,ఆర్థిక, రాజకీయంగా కురువలు ఎదగాలి

జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
మల్దకల్ నవంబర్ 11(జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో మదాసి కురువ ఆరాధ్య దైవమైన భక్త కనక దాసు 535వ జయంతి ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరై ఆయన చిత్రపటాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ మదాసి కురువలు విద్య,ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని, చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు.. కుల సోదరులకు,బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు…అనంతరం అతిధులను కుల పెద్దలు సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉలిగే పల్లె సర్పంచ్ చిన్న రాముడు, ఉపసర్పంచ్ గోవిందు ఎంపిటిసి పోలీస్ తిమ్మప్ప మేకల సోంపల్లి వెంకటన్న  సీతారాములు,గవ్వల పరుశ,రంగస్వామి,ఉలిగేపల్లి జయన్న ,దాసు,మల్దకల్,ఉప సర్పంచ్ సవారన్న,మాజీ సర్పంచ్ ఈశ్వర్,హన్మంతు,సవారన్న,సత్యన్న,నాగరాజు,జయకృష్ణ, దౌల్,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.