విద్యార్థినికి ఆర్థిక సహాయం

గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 24 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన తనూజ కు గద్వాలకు చెందిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ ఇంజనీర్ భాస్కర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినికి నగదు తో పాటు వివిధ రకాలైన సాయం శనివారం చేశారు.
తనూజ తల్లిదండ్రులను
కొంత కాలం క్రితం కోల్పోయిందనీ, కష్టపడి చదువుతూ ప్రస్తుతం కె జి బి వి గట్టు నందు ఇంటర్ మొదటి సంవత్సరం ఎం పి సి చదువుతున్నదనీ,5,000/- రూపాయల ఆర్థికసహాయం తో తనుజాకు నోట్ బుక్స్, డిక్షనరీ,ఇంగ్లీష్ గ్రామర్ బుక్, ఫస్ట్ ఇయర్ స్టడీ మెటీరియల్స్ దసరా పండుగకు కావలసిన రెండు జతల కొత్త బట్టలు తో బాటు 1500/- రూపాయలు ఆమెకు అవసరమైన కొన్ని వస్తువులు కూడా అంధిచడం జరిగిందనీ వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో తిరుమలేష్, సంజీవ్,ఆంజనేయులు,నాగేష్,మురళి,ప్రకాష్,కోటి,అశోక్ లు పాల్గొన్నారు.