విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, నగలు లూటీ

26gf9dt0 లక్నో: ఉత్తరప్రదేశ్ లో విద్యార్థినిపై నలుగురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించారు. ఉత్తర ప్రదేశ్ లోని ఎతాహ్ జిల్లాలోని తప్వా గ్రామంలో 14 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈమె సమీపంలోని ఊరిలో ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. సోమవారం బాలిక స్కూల్ లో ఫీజు చెల్లించింది తరువాత సైకిల్ మీద సోంత గ్రామానికి బయలుదేరింది. మార్గం మద్యలో గుర్తు తెలియని నలుగురు నిందితులు బాలికను అడ్డగించి నిర్మానుష ప్రాంతానికి లాక్కోని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక మీద అత్యాచారం చేసిన నిందితులు ఆమెపై దాడి చేశారు. బాలిక శరీరం మీద ఉన్న బంగారు నగలు లాక్కోని బాలికను పిలుచుకుని వచ్చి రోడ్డు మీద వదిలి అక్కడి నుండి పరారైనారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అలీగంజ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.