విద్యార్థినులను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు : ఎస్సై హరిప్రసాద్ రెడ్డి

గద్వాల రూరల్ అక్టోబర్ 18 (జనంసాక్షి):- పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను వేధిస్తున్న వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. గద్వాల పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినీలను హోటల్ యజమాని బ్రహ్మయ్య వెంటపడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో తమ తల్లిదండ్రులకు ఆ విద్యార్థినిలు  చెప్పారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బ్రహ్మయ్య పై చట్టం కింద కేసు నమోదు కాగా… అతను పరారీలో ఉన్నారు అని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.