విద్యార్థి దశ నుండే దేశభక్తి దైవభక్తి పెంపొందించుకోవాలి

– ఎస్ఐ గిరి
కుల్కచర్ల,ఆగస్టు 20(జనం సాక్షి):
 కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో శనివారం రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఐ గిరి పాల్గొని మాట్లాడుతూ..భావితరాలకు అందించే దిశగా సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు చిన్ననాటి నుండి దేశభక్తి, దైవభక్తి పెంపొందించే విధంగా కృషి చేయాలంటూ విద్యార్థుల్ని అభినందిస్తూ అక్కడున్న పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థి తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ పాషా, వెంకట్ రాములు, వెంకటయ్య, గోపాల్, నర్సింహులు, ఆంజనేయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.