విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

మల్దకల్ అక్టోబర్18(జనం సాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారము ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను సర్పంచ్ యాకోబు,ఎంఈఓ కొండారెడ్డి,ఎంపీడీవో కృష్ణయ్య, డిప్యూటీ తాసిల్దార్ మదన్ మోహన్ గౌడ్ పంపిణీ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగాలని ఉన్నత స్థానం సాధించడానికి ప్రతి విద్యార్థి బాగా చక్కగా చదివి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు వేద ట్రస్టు వారు నిర్వహించే పరీక్షలకు కావాలని ఆయన సూచించారు.పదో తరగతి పరీక్షలు మంచి మార్కులు సాధించి మండల, జిల్లా స్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానియేల్,ఉపసర్పంచ్ మల్దకల్,పంచాయతి కార్యదర్శి మాబి,విద్యా కమిటీ చైర్మన్ ఏఎస్ఐ ఈశ్వరయ్య ఉపాధ్యాయులు క్రాంతి కుమార్,భాస్కరు,మణెమ్మ, వరలక్ష్మి ,శోభ,అమృత్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.
Attachments area