విద్యార్థులకు బుక్స్ ,పెన్నులు, పెన్సిల్లు పంపిణి

టేకులపల్లి ,ఆగస్టు 16( జనం సాక్షి) : మండలంలోని కొప్పురాయి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ గ్రామానికి చెందిన పుణ్య దంపతులైన పూనం సమ్మయ్య, రాధ జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బుక్స్ పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వారి అభినందించారు.