విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

ఎంపీపీ సత్యహరిశ్చంద్ర
– ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు బెడ్ షీట్స్,నోట్ బుక్స్ పంపిణీ
జూలై 14(జనం సాక్షి):
విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర సూచించారు.
 గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఆకస్మితంగా సందర్శించారు. అనంతరం విద్యార్థులకు బెడ్ షీట్స్, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ..విద్యార్థులకు మంచి విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజుకు కోరారు.విద్యార్థుల సమస్యల పట్ల ఆరా తీశారు.విద్యార్థులు మంచిగా చదువుకొని నేటి బాలురే రేపటి పౌరులుగా కావాలని,మీ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్యా రెడ్డి, ఎంపీటీసీ సీహెచ్ ఆనందం,దోమ ఎంఈఓ హరిచందర్ నాయక్, గుండుమల్ల నర్సిములు టిఆర్ఎస్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రధానోపాధ్యాయులు రాజు, పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ రాథోడ్, రాజు, రాములు, నర్సింలు, విద్యార్థులు పాల్గొన్నారు.