విద్యార్థులపై దూసుకెళ్లిన బస్సు
లక్నో,జూన్11(జనం సాక్షి): యూపిలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కన్షౌజ్ వద్ద ఆగ్రా – లఖ్నవూ ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులపైకి బస్సు దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కన్హౌజ్ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50వేల
చొప్పున పరిహారం ప్రకటించారు.