విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో విద్యను అభ్యాసించాలి

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ సత్కారాలు

జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : విద్యార్థులు పాఠశాల దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని జై నడిగడ్డ యువత జోగులాంబ గద్వాల జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జై నడిగడ్డ యువత వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర మాజీ బిసి కమిషన్ సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆదేశానుసారం ఉత్తమ విద్యార్థిని, విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభ సత్కారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి, ఉత్తమ మార్కులు సాధించిన 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ, మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఎర్రవల్లి గురుకుల పాఠశాల, బీచుపల్లి గురుకుల పాఠశాల స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విజేతలకు పురస్కారాలు అందచేసి మేమొంటో మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. జై నడిగడ్డ యువత జిల్లా కోఆర్డినేటర్ రామక్రిష్ణ, సంచార జాతుల రాష్ట్ర నాయకులు బొప్పల శ్రీనివాస్, మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని నడిగడ్డలోని విద్యార్థులకు జై నడిగడ్డ యువత వ్యవస్థాపకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ విద్యాపరంగా సహయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. అలాగే పాఠశాలల ఉపాధ్యాయలు కూడా విద్యార్థుల యొక్క అభిరుచులు గుర్తించి వారికి ఇష్టమైన రంగంవైపు మార్గనిర్దేశం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జై నడిగడ్డ యువత జిల్లా సమన్వయకర్తలు కురువ వీరేష్, బోయ సత్యం, టి. రామాంజనేయులు, నరేష్ నాయుడు, గట్టన్న, నరేష్ గౌడ్, రాకేష్, రాఘవేంద్రగౌడ్, అంజి, సురేందర్, మన్యంకొండ, గట్టన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు సువార్త ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.