విద్యుత్‌ దీక్ష భగ్నం

వామపక్ష నేతల అరెస్టు
హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : విద్యుత్‌ సమస్యపై పది వామపక్ష పార్టీల ఆధ్యర్యంలో నాలుగు రోజులుగా ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు మంగళవారం రాత్రి భగ్నం చేశారు. పలువురు నేతల ఆర్యోగ పరిస్థితి విషమించడంతో పాటు ఆందోళన రోజు రోజుకు తీవ్రతరం కావడంతో పోలీసులు కమల్‌ హాసన్‌రెడ్డి నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకొని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో పలువురు వామపక్ష నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పలువురు నేతలు కిందపడి గాయపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిని ఆస్పత్రికి తరలించి బలవంతంగా చికిత్స అందిస్తున్నారు.