వినాయకుడిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు

వినాయకుడిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు

రాయికల్ (జనం సాక్షి): రాయికల్ పట్టణ మరియు మండలస్థాయి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యూత్ వారు ఏర్పాటుచేసిన వినాయక స్వామిని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా. బోగ శ్రావణి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరిపై స్వామివారి దీవెనలు ఉండాలని పాడిపంటలు బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణ,మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మయూత్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ,మండల స్వర్ణకార సంఘం సభ్యులు,విశ్వకర్మ యూత్ సభ్యులు,భక్తులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.