వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు…

వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు

భువనగిరి టౌన్ ( ):–భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు ఆర్ బి నగర్ ఉప్పలమ్మ గుడి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడిని పిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ రైస్ అసోసియేషన్ పసుపునూరి నాగభూషణం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఉప్పలమ్మ గుడి యూత్ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా
సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేశుని నవరాత్రులు భక్తిశ్రద్ధలతో గణనాథుని నవరాత్రులు జరుపుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉప్పలమ్మ గుడి యూత్ సభ్యులు సంపత్ శ్రీపతి నరేష్ గణేష్ రాజు మహేష్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.