వినాయక గణపతి మండపాలను సందర్శించిన

పాడి శాలిని రెడ్డి

వీణవంక సెప్టెంబర్ 25 (జనం సాక్షి) వీణవంక మండలంలోని పలు గ్రామాలలో “వినాయక మండపాలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలిని రెడ్డి మండలంలో వినాయక గణపతి మండపాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వీణవంక మండలంలోని వినాయక గణపతి మండపాలు గ్రామాల వారీగా పర్యటించారు అనంతరం
వినాయక గణపతి మండపాలను సందర్శించి ప్రతి గణనాధునికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పాడి శాలిని రెడ్డి అందించారు. వారి
వెంట వీణవంక మండలం ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి. వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ మావురపు విజయ భాస్కర్ రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.