వినాయక లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  హిందువుల సంస్కృతి  సంప్రదాయాలను గౌరవిస్తూ ముస్లిం సోదరుడు వినాయక లడ్డు ప్రసాదాన్ని వేలం పాటలో  మహమ్మద్ జావేద్  గురువారం కైవసం చేసుకున్నాడు. మండల పరిధిలోని నాజ్ ద్ధిక్ సింగారం గ్రామానికి చెందిన మహమ్మద్ జావేద్ తన స్వగ్రామంలో హిందువుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో 52 వేల కైవసం చేసుకోవడతో అందరు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో సర్పంచ్ అరుణమ్మ పాండురంగారెడ్డిజావేద్ ని ఘనంగా సన్మానించారు. గ్రామంలో ప్రజలంతా జావేద్ ను ఘానంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో  ఉపసర్పంచ్ వరప్రసాద్ రెడ్డి,వార్డు సభ్యులు నడ్డి విజయకుమార్, రాజిరెడ్డి,మాజీ ఎంపీటీసీ భాగ్యమ్మగాలయ్య,చిత్తరీ, కారోబార్ కృష్ణ, ఖాడారి,శ్రీశైలం,మాజీ ఉప సర్పంచ్ బొడ కృష్ణ, ఎండీ షేఖిల్, అశ్వద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Attachments area