విన్నూతనంగా దేశభక్తిని చాటుకున్నారు…

 

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / స్వాతంత్రం సాధించుకొని 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని ఇంటికన్నె గ్రామంలో విన్నూతనంగా తమ దేశభక్తిని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే….స్థానిక సర్పంచ్ గణపారపు సరిత రమేష్ ల ఆధ్వర్యంలో పొలంలో వరి నారు తో 75 వ సంఖ్య ఆకారంలో నాట్లు వేసి దేశభక్తిని చాటుకుని పలువురిని ఆకర్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి దేశం గర్వపడేలా ఉండాలని,ప్రతి ఒక్కరు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,గ్రామ రైతులు పలువురు పాల్గొన్నారు.