విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలి:జేడీ శీలం

ఢిల్లీ: విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలని ఎంపి జేడీ శీలం అన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు మా మద్దతు ఉంటుందని జేడీ శీలం తెలిపారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన బిల్లులో ఎలాంటి లోపాలు లేవని, చిన్న చిన్న మార్పులు మాత్రమే అవసరం అని తెలిపారు.