వివాదంలో ఉన్న భూమిని…

– పరిమితికి మించి… పర్మిషన్లు ఇచ్చి…
– ఊరుకొండ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.
ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎంపీడివో ప్రభాకర్ తెలిపారు. ఊర్కొండ కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న సర్వే నంబర్ 220/ఈ1/1 భూమి బోధ రాణి, మేకల శివకుమార్ మధ్య భూవివాదం ఉంది. భూవివాదం ఉన్న భూమిలో తన పరిధి దాటి బోధరాణి పేర వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ అనుమతులు ఇచ్చారు. దీంతో ఊర్కొండకు చెందిన మేకల శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారని ఎంపీడివో తెలిపారు. వివాదంలో ఉన్న భూమి విషయంలో గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉన్నట్లు బాధితులు మేకల శివకుమార్ వాపోయారు.