పరకాల అబద్దల పుస్తకాన్ని తగలబెట్టిన తెలంగాణ వాదులు
బషీర్బాగ్ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్క్లబ్ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో తెలంలగాణవాదులు ప్రెస్క్లబ్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రెస్క్లబ్లోనికి చొచ్చుకెళ్లేందుకు మత్నించడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసుల స్టేషన్కు తరలించారు.