*వీఆర్ఏలకు మద్దతు తెలిపిన న్యాయవాది ఎల్లారెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 8(జనం సాక్షి)
రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సోమవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది ఎల్లారెడ్డి, హన్మాపూర్ మాజీ సర్పంచ్ లొంక నర్సింలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు న్యాయవాది ఎల్లారెడ్డి మాట్లాడుతూ… అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రిటర్మెంట్ అయిన వీఆర్ఏలకు పెన్షన్ ఏర్పాటు చేయాలని,ప్రమోషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.