వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

సీపీఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు
జనం సాక్షి, వంగూరు:
మండల కేంద్రంలో సోమవారం వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సిపిఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని అన్నారు. అర్హులైన వీఆర్ఏలందరికి ప్రమోషన్లు కల్పించాలని అన్నారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ  కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.