వీఆర్ఏ ల నిరాహారదీక్ష కు బిజెపి పార్టీ మద్దతు

**33 వ రోజుకు చేరుకున్న
వీఆర్ఏ ల దీక్ష **

గద్వాల్ ఆర్ సి (జనం సాక్షి) ఆగస్ట్ 26,
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ దగ్గర 33వ ,రోజున నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డికె. అరుణమ్మ గారి అదేశాల మేరకు ఈ రోజు కలేక్టరేట్ దగ్గర మద్దతు తెలిపి నిరాహారదీక్ష లో
పార్టీ నాయకులు అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ పేస్కేల్‌ ఇస్తామని, అర్హతగల వీఆర్‌ఏ లకు పదోన్నతులు కల్పిస్తామని, 55సంవత్స రాల పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యో గాలు కల్పిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారన్నారు. హామీలను జీవో రూపంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదని తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశరని పుట్టిన ప్రతి బిడ్డ పైన 1,25,000 రూపాయల అప్పు ఉందని
తెలంగాణ ఉద్యమంలో 14 వందల మంది అమరులైతే, కెసిఆర్ ,కేసీఆర్ కుటుంబానికి చిటికెన వేలు దెబ్బ కూడా తగలలేదు అని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లు దోచుకున్న,పాలమూరు రంగారెడ్డి తుమ్మిళ్ల బీమా ప్రాజెక్టులు పై కోట్లు తిన్నరని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో తిన్న కోట్ల రూపాయలను రైతు కి ఖర్చు చేస్తే 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామాంజనేయులు,జిల్లా మహిళ మోర్చఉపాధ్యక్షురాలు భారతి,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవదాసు,డబ్బిలేటినరసింహ,బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్,బిజెపి నాయకులు పేపర్ నరసింహ, ఢిల్లీవాల క్రిష్ణ, అంజి , నాయకులు తదితరులు పాల్గొన్నారు.