వీరప్పన్ అనుచరుల ఉరిపై స్టే పొడగింపు
ఢిల్లీ : నలుగురు వీరప్పన్ అనుచరులకు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఈ స్టే కొనసాగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ తిరస్కరించడంతో వీరప్పన్ అనుచరుల న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.